ముంబైని భయపెట్టింది అతడే..!

14 మంది ఉగ్రవాదులు 400 కిలోగ్రాముల ఆర్డీఎక్స్‌తో పేలుళ్లు జరపడానికి ముంబై నగరంలోకి ప్రవేశించారని బెదిరింపు సందేశం పంపిన నోయిడాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 6 Sept 2025 2:28 PM IST

ముంబైని భయపెట్టింది అతడే..!

14 మంది ఉగ్రవాదులు 400 కిలోగ్రాముల ఆర్డీఎక్స్‌తో పేలుళ్లు జరపడానికి ముంబై నగరంలోకి ప్రవేశించారని బెదిరింపు సందేశం పంపిన నోయిడాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 79లోని అతని నివాసం నుంచి అశ్వినికుమార్ సుప్రాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు.

గురువారం ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు బెదిరింపు సందేశం అందింది, అందులో 14 మంది ఉగ్రవాదులు మానవ బాంబులు, 400 కిలోల RDXతో నగరంలోకి ప్రవేశించి, నగరాన్ని పేల్చివేయడానికి 34 వాహనాల్లో అమర్చారని ఆ వ్యక్తి పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందేశం అందిన వెంటనే పోలీసు శాఖలో భయాందోళనలు మొదలయ్యాయి. గణేష్ ఉత్సవాల నిమ‌జ్జ‌నం సందడిలో ఉన్న‌ తరుణంలో ఈ సందేశం పోలీసులను మరింత అప్రమత్తం చేసింది. ఈ బెదిరింపు మెసేజ్‌పై పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు.

Next Story