మణిపూర్లో కీలక పరిణామం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను కలిసిన ఎమ్మెల్యేలు
మణిపూర్లో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
By Medi Samrat
మణిపూర్లో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నేతలు రాజ్యభవన్లో గవర్నర్ను కలిసింది. బీజేపీ నేతృత్వంలోని 10 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే వాదనతో ఇంఫాల్లోని రాజ్యభవన్కు చేరుకుని గవర్నర్ను కలిశారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో బీజేపీకి చెందిన 8 మంది, ఎన్పీపీకి చెందిన 1, స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనేలా ‘జనరంజక ప్రభుత్వాన్ని’ ఏర్పాటు చేయాలని 21 మంది ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖపై బీజేపీకి చెందిన 13 మంది, ఎన్పీపీకి చెందిన 3 మంది, ఇద్దరు స్వతంత్ర సభ్యులు సంతకాలు చేశారు.
మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు దావా వేసిన ఎమ్మెల్యేలు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ సంఖ్య 31. మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మినహా 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని గవర్నర్ను కలిసిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యే తోక్చోమ్ రాధేశ్యామ్ అన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపం నిషికాంత్ మాట్లాడుతూ.. గవర్నర్కు పేపర్ ఇచ్చామని, దానిపై 22 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారన్నారు. ఎన్డీయే ఎమ్మెల్యేలందరూ మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు.