ప్రధానికి తమిళనాడు సీఎం లేఖ‌.. హిందీని రుద్దడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు

MK Stalin writes to PM Modi on ‘attempts to impose Hindi’ in Tamil Nadu. కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ కమిటీ చేసిన

By Medi Samrat  Published on  16 Oct 2022 1:30 PM GMT
ప్రధానికి తమిళనాడు సీఎం లేఖ‌.. హిందీని రుద్దడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు

కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ హిందీని రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దూకుడు చర్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అన్ని టెక్నికల్, నాన్-టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లు, కేంద్రీయ విద్యాలయాలతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలలో హిందీని బోధనా మాధ్యమంగా చేయాలనే సిఫార్సు కూడా ఇందులో ఉందని ఆయన చెప్పారు.

యువత హిందీని చదివితేనే కొన్ని ఉద్యోగాలకు అర్హులు అవుతారని, రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో తప్పనిసరి పేపర్లలో ఇంగ్లీషును తొలగించాలని సిఫార్సు చేయబడిందని అన్నారు. ఇవన్నీ సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని భావిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో తమిళంతో సహా 22 భాషలు ఉన్నాయని డీఎంకే చీఫ్ అన్నారు. ఈ పట్టికలో మరికొన్ని భాషలను కూడా చేర్చాలని అనేక డిమాండ్లు ఉన్నాయన్నారు. భారతీయ యూనియన్‌లో హిందీ మాట్లాడే వారి కంటే.. హిందీ కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారి సంఖ్య సంఖ్యాపరంగా ఎక్కువగా ఉందని స్టాలిన్ అన్నారు. ప్రతిభాషకు ప్రత్యేకత ఉందని ప్రధాని గుర్తిస్తారని ఆశిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు.

హిందీని విధించడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే శ్రేణులు నిర‌స‌న‌లు చేస్తున్నాయి. డీఎంకే నిరసనకు ఆ పార్టీ నాయ‌కుడు ఉదయనిధి స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు. తమిళనాడులోని కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని హోం మంత్రి అమిత్ షా చేసిన సిఫారసుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొన‌సాగుతున్నాయి.


Next Story