భారత సైన్యం అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు

Ministry of Defense has provided new weapons to the Indian Army. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్‌ రెడీ అవుతోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న

By -  అంజి
Published on : 16 Aug 2022 9:01 PM IST

భారత సైన్యం అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్‌ రెడీ అవుతోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాతో సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే జల, వాయు మార్గాల్లో నిఘా వ్యవస్థను కేంద్ర రక్షణ శాఖ మరింత బలోపేతం చేస్తోంది. చైనాకు చెక్‌ పెట్టేందుకు సైన్యానికి భారత ప్రభుత్వం సరికొత్త అస్త్రాలను అందించింది. పాంగాంగ్‌ సరస్సులో ఏ మూలకైనా నిమిషాల్లో చేరుకునేలా తయారు చేసిన బోటుతో సహా మరికొన్ని ఆయుధాలను ఇవాళ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యానికి అందజేశారు.

పాంగాంగ్‌ సరస్సుపై పట్టు సాధించేందుకు సరికొత్త టెక్నాలజీతో తయారు చేసిన బోట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బోట్‌లను భారత సైన్యానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధికారికంగా అందించారు. ఈ బోటులో ఒకేసారి 35 మంది సైనికులను సరస్సులోని ఏ ప్రాంతానికైనా చాలా తక్కువ టైమ్‌లో చేర్చవచ్చు. దీంతో సరిహద్దుల్లో భారత సైనిక శక్తి మరింత పెరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ బోట్‌లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు.

అలాగే బార్డర్‌లో శత్రు దేశాల కదిలికలను నిశితంగా పసిగట్టేందుకు.. దేశీయంగా తయారు చేసిన డ్రోన్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇది కూడా భారత సైన్యం అమ్ముల పొదిలో చేరింది. ఈ నిఘా డ్రోన్‌ సరిహద్దుల్లో సూక్ష్మమైన కదలికలను కూడా పసిగట్టగలుగుతుంది. ఈ డ్రోన్‌ వ్యవస్థ సాయంతో సరిహద్దులో భారత్‌ బలం మరింత పెరగనుందని ఆర్మీ అధికారులు తెలిపారు. అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైనికులకు F-INSAS వ్యవస్థకు సంబంధించిన AK-203 అసాల్ట్ రైఫిల్స్​ను అందజేశారు.

Next Story