ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు..ఏఎస్పీ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.

By Knakam Karthik
Published on : 9 Jun 2025 11:08 AM IST

National News, Chhattisgarh, Maoists, Police,

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు..ఏఎస్పీ మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. నక్సల్ ఆపరేషన్‌కు వెళ్లి వస్తుండగా కుంట సమీపంలోని డొండ్రా ఫారెస్ట్ ఏరియాలో ప్రెజర్ బాంబ్ పేలింది. ఈ ఘటనలో అడిషనల్ ఎస్పీ ఆకాశ్ రావు, డీఎస్పీ, సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్పీ పరిస్థితి విషమంగా ఉంది. పలువురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన పోలీసులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే జూన్ 10న సీపీఐ(ఎం) భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, నక్సలైట్ల సంఘటనలను నివారించడానికి ఏఎస్పీ ఆకాశ్‌రావు గిరిపుంజే ఆ ప్రాంతంలో పాదచారుల గస్తీ విధుల్లో ఉన్నారు. గాయపడిన వారందరికీ కొంట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఏఎస్పీ ఆకాశ్‌రావు పరిస్థితి చాలా విషమంగా ఉంది. మిగిలిన గాయపడిన వారు ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డారు. మెరుగైన చికిత్స కోసం అదనపు ఎస్పీ ఆకాశ్‌రావును త్వరలో ఉన్నత వైద్య కేంద్రానికి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి..అని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.

Next Story