కాంక్రీట్ మిక్సర్‌తో మిఠాయి తయారీ.. 15 ట్రాలీలతో భోజనం సరఫరా.. భారీ అన్నదానం

Malpua solution made in a concrete mixer in madhyapradesh. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో అన్నదానం కోసం వంటలు తయారు చేయడం వంట సిబ్బందికి సవాల్‌గా మారింది.

By అంజి  Published on  13 Dec 2021 4:04 AM GMT
కాంక్రీట్ మిక్సర్‌తో మిఠాయి తయారీ.. 15 ట్రాలీలతో భోజనం సరఫరా.. భారీ అన్నదానం

శనివారం చంబల్‌లో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో అన్నదానం కోసం వంటలు తయారు చేయడం వంట సిబ్బందికి సవాల్‌గా మారింది. దీంతో వారు కాంక్రీట్ మిక్సర్ యంత్రంలో మాల్పువా స్లర్రీ (ఓ రకం మిఠాయి)ని తయారు చేశారు. 15 ట్రాక్టర్ ట్రాలీల్లో ఖీర్, కూరగాయలు, మాల్పువాను ఎక్కించి ప్యాన్‌లోకి ఎక్కించారు. 100 గ్రామాల ప్రజలు పాలు, కూరగాయలు, పిండి తీసుకొచ్చారని నిర్వాహకులు తెలిపారు. వేలాది మంది వరసగా కూర్చుని భోజనం చేశారు. రాత్రి 11 గంటల వరకు అన్నదానం జరిగింది. రెండు లక్షల మంది భోజనం చేశారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని మొరెనాలోని ఘిరోనా దేవాలయం వెనుక క్వారీ నది ఒడ్డున ఉన్న మౌని బాబా ఆశ్రమంలో భగవత్ కథ గత నెల రోజులుగా జరుగుతోంది. భగవత్ కథ ముగింపు సందర్భంగా శనివారం ఇక్కడ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బంగాళదుంప-క్యాబేజీ కూరగాయలతో ఐదు ట్రాలీలు, పిండి, నెయ్యి, నూనెతో నిండిన 12 ట్రాలీలను తీసుకువచ్చారు. భారీ అన్నదానం కోసం నగరం చుట్టుపక్కల గ్రామాల నుంచి పాలను సేకరించారు. ఖీర్-మాల్పువా కోసం రైతులు, స్థానిక నివాసితులు కూరగాయల కోసం సహకరించారు. ఇక్కడ సమీపంలోని 100 గ్రామాల నుండి పాలు, ఇతర ఆహార పదార్థాలు సేకరించబడ్డాయి.

భారీ అన్నదానానికి పరిమిత సంఖ్య లేదు. నగరం నలుమూలల నుంచి, సమీప గ్రామాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చారు. అన్నదానం కోసం ఖీర్‌ను చాలా చోట్ల పెద్ద పెద్ద వంట పాత్రలలో తయారు చేశారు. ఇక మాల్పువా పిండిని చేతితో కలపడం సాధ్యం కాదని, కాంక్రీట్ మిక్సింగ్ మిషన్‌ను ఉపయోగించారు. భారీ అన్నదానంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఖీర్, మల్పువా, కూరగాయలు బుట్టల్లో కాకుండా ట్రాక్టర్ ట్రాలీల్లో తీసుకెళ్లారు. సాధారణంగా చంబల్ లో ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు ట్రాక్టర్ ట్రాలీల్లో నింపి అందజేస్తారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన భారీ అన్నదాన కార్యక్రమం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది.

Next Story