ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోలేదు : నెదుమారన్ సంచ‌ల‌నం

LTTE's Prabakaran is alive, will appear in public soon. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోలేదని.. ఇంకా బతికే ఉన్నాడనే వార్త కొందరికి ఆనందాన్ని ఇస్తుండగా.

By M.S.R
Published on : 13 Feb 2023 9:00 PM IST

ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోలేదు : నెదుమారన్ సంచ‌ల‌నం
ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోలేదని.. ఇంకా బతికే ఉన్నాడనే వార్త కొందరికి ఆనందాన్ని ఇస్తుండగా.. మరికొందరికి ఎంతో షాకింగ్ గా అనిపిస్తోంది. ప్రభాకరన్ చనిపోయాడని ప్రపంచం మొత్తం నమ్ముతున్న సమయంలో ప్రభాకరన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడనే వార్త సంచలనంగా మారింది. తమిళ్ నేషనలిస్ట్ మూవ్ మెంట్ నాయకుడు పర నెదుమారన్ తాజాగా మాట్లాడుతూ.. ప్రభాకరన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. త్వరలోనే అందరి ముందుకు వస్తాడు. తమిళులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి, తమిళ సమాజం తరపున పోరాడటానికి వెలుపిల్లై ప్రభాకరన్ మళ్లీ వస్తాడు అంటూ చెప్పడం పెను సంచలనంగా మారింది. తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ నెదుమారన్ ఈ వ్యాఖ్యలు చేశారు.


ప్రస్తుతం అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, శ్రీలంకలో రాజకీయ సంక్షోభం, రాజపక్స ప్రభుత్వం అధికారంలో కోల్పోవడం వంటివి ప్రభాకరన్ బయటికొచ్చేలా చేస్తున్నాయని నెదుమారన్ అన్నారు. ప్రభాకరన్ చనిపోయాడని జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నమైందని సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ప్రభాకరన్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేస్తారు. తమిళుల కోసం తను చేయబోయే పోరాటానికి సంబంధించిన ప్లాన్ ప్రకటిస్తారని అన్నారు. పార్టీలకు అతీతంగా తమిళనాడులో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు, తమిళులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు ప్రభాకరన్‌కి అండగా నిలవాలని నెదుమారన్ కోరారు.

ప్రభాకరన్ చనిపోయారంటూ 2009 మే 18న శ్రీలంక ఆర్మీ ప్రకటించింది. ప్రభాకరన్ మృతదేహం ఫొటోలను కూడా విడుదల చేసింది. ప్రభాకరన్ కుమారుడు కూడా చనిపోయాడని తెలిపింది. ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్ చనిపోయారని అప్పట్లో శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడంటూ ఎవరూ చెప్పలేదు.. ఇప్పుడు ఒక్కసారిగా నెదుమారన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


Next Story