ఆసుపత్రి బెడ్స్ ను సిద్ధం చేసుకోండి..!

భారతదేశంలోని పలు నగరాల్లో కోవిడ్-19 నెమ్మదిగా ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది.

By Medi Samrat
Published on : 24 May 2025 7:30 PM IST

ఆసుపత్రి బెడ్స్ ను సిద్ధం చేసుకోండి..!

భారతదేశంలోని పలు నగరాల్లో కోవిడ్-19 నెమ్మదిగా ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది. దీనితో ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో ఈ నెలలో కొత్త కేసులు నమోదయ్యాయ. దేశ రాజధానిలో మూడు సంవత్సరాలలో మొదటిసారిగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని పిటిఐ నివేదించింది.

లక్షణాలు సాధారణంగా స్వల్పంగా ఉంటాయని, వైరస్ సోకిన వారు నాలుగు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారు. కొన్ని సాధారణ లక్షణాలు జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట వంటివి ఉంటాయి. ఢిల్లీలో 23 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, దీనితో బీజేపీ ప్రభుత్వం ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, పరీక్షా కిట్లు, వ్యాక్సిన్ల లభ్యతపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. తాజా వేరియంట్ "సాధారణ ఇన్ఫ్లుఎంజా లాంటిది" కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ అన్నారు.

Next Story