నీట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తన..!

Kerala man claims daughter asked to remove innerwear at NEET exam centre. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే

By Medi Samrat  Published on  18 July 2022 3:11 PM GMT
నీట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తన..!

నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు తన కూతురిని ఇన్నర్‌వేర్ తొలగించమని అడిగాడని కేరళలోని కొల్లం జిల్లాలో ఒక వ్యక్తి ఆరోపించారు. దీంతో మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేసి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కొల్లం రూరల్ ఎస్పీని ఆదేశించింది. ఈ ఘటనపై కొట్టారకర పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాతమంగళంలోని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు తన కుమార్తెతో సహా మహిళా నీట్ ఆశావాదులు తమ ఇన్నర్‌వేర్‌లను తొలగించాలని కోరారని చెప్పాడు.

విద్యార్థినులను మానసికంగా హింసించారని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) డ్రెస్ కోడ్‌లో ఇన్నర్‌వేర్‌లను తొలగించాలని సూచించడం లేదని ఫిర్యాదుదారు తెలిపారు. కనీసం 90 శాతం మంది విద్యార్థులను పరీక్ష రాసే ముందు తమ ఇన్నర్‌వేర్‌లను తొలగించాలని అడిగారని, వాటిని స్టోర్ రూమ్‌లో పడేయమని అడిగారని బాలిక తండ్రి పేర్కొన్నారు.

ఫిర్యాదుదారు మాట్లాడుతూ.. "ప్రాథమిక తనిఖీ తర్వాత, మెటల్ డిటెక్టర్ ద్వారా లోపలి భాగాల హుక్ గుర్తించి.. నా కుమార్తెకు తొలగించమని అడిగారు. దాదాపు 90 శాతం మంది మహిళా అభ్యర్థులు తమ ఇన్నర్‌వేర్‌లను తీసివేసి, స్టోర్ రూమ్ లో వాటిని వేసేసి వచ్చారు. పరీక్ష ఇస్తున్నప్పుడు అభ్యర్థులు మానసికంగా ఇబ్బంది పడ్డారు." అని చెప్పారు. కేరళలోని మార్తోమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీకి చెందిన కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. అయితే పరీక్షా కేంద్రం నిర్వాహకులు మాత్రం ఆరోపణలు నిరాకరించింది.






Next Story