మార్చి 22న‌ ఆ రాష్ట్రం మొత్తం బంద్

బెళగావిలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు కండక్టర్‌పై జరిగిన దాడికి ప్రతిస్పందనగా మార్చి 22, శనివారం కర్ణాటకలో బంద్ పాటించనున్నారు.

By Medi Samrat
Published on : 20 March 2025 9:15 PM IST

మార్చి 22న‌ ఆ రాష్ట్రం మొత్తం బంద్

బెళగావిలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు కండక్టర్‌పై జరిగిన దాడికి ప్రతిస్పందనగా మార్చి 22, శనివారం కర్ణాటకలో బంద్ పాటించనున్నారు. అనేక కన్నడ అనుకూల సంస్థలు కర్ణాటక రాష్ట్ర బంద్ ను ప్రకటించాయి. మరాఠీ మాట్లాడకపోవడం వల్ల కండక్టర్‌పై దాడి జరగడంతో భాషా ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది.

ఫిబ్రవరి నెలలో బెళగావిలో మరాఠీలో మాట్లాడలేదనే కారణంతో కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్ పై మరాఠీ అనుకూల గ్రూపులు దాడి చేశారు. ఈ ఘటనకు నిరసనగా కన్నడ సంఘాలు సంయుక్తంగా ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల బంద్‌కు కన్నడ ఒకూట పిలుపునిచ్చింది. మరాఠీ అనుకూల గ్రూపులపై, ముఖ్యంగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి (MES)పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హింసను ప్రేరేపించి ప్రాంతీయ సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. బెళగావి, ఇతర సరిహద్దు జిల్లాల్లో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నందున, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు బంద్ పాటించే రోజు భారీగా భద్రతా సిబ్బందిని మోహరించాలని భావిస్తున్నారు.

Next Story