ఈవీఎంలను కాదు.. ప్ర‌ధాని ప్ర‌జ‌ల‌ గుండెలను హ్యాక్ చేశారు..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈవీఎం హ్యాకింగ్‌పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై మాట్లాడారు.

By -  Medi Samrat
Published on : 10 Dec 2025 3:03 PM IST

ఈవీఎంలను కాదు.. ప్ర‌ధాని ప్ర‌జ‌ల‌ గుండెలను హ్యాక్ చేశారు..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈవీఎం హ్యాకింగ్‌పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై మాట్లాడారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ ఈవీఎంలను హ్యాక్ చేయరని, ప్రధాని ప్ర‌జ‌ల గుండెలను హ్యాక్ చేస్తారని కంగనా రనౌతా అన్నారు.

గతంలో రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పెద్ద ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ.. 'నేను రాహుల్ గాంధీ పర్యటనల గురించి ఎటువంటి వార్తలను ప‌ట్టించుకోను, ఆయ‌న‌ గురించి ఎటువంటి వార్తలను చదవను. ఆ వార్తలు పనికిరానివ‌ని అన్నారు.

రాహుల్ గాంధీ డిసెంబర్ 15 నుంచి జర్మనీలో పర్యటిస్తున్నారు. లోక్‌సభ శీతాకాల సమావేశాల మధ్యలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. దీనిపై ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కు ఎందుకు పడిపోయిందో అందరికీ స్పష్టంగా తెలుసు. తన క్యారెక్టర్‌లో బలం లేదు కాబట్టి ఆ క్యారెక్టర్‌పైనా కామెంట్స్ చేయక్కర్లేదు. కాబట్టి ఆయ‌న‌ గురించి నేను చెప్పడానికి ఏమీ లేదు."

రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనకు వస్తున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా సమాచారం ఇచ్చింది. ప‌ర్య‌ట‌న‌లో జర్మనీ ఎంపీలతోనూ రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. అలాగే ప‌లు విష‌యాల‌పై ఆయ‌న మాట్లాడ‌నున్నారు. జర్మనీలో నివసిస్తున్న భారతీయులతో కూడా రాహుల్ గాంధీ సమావేశమై మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూకే జనరల్ సెక్రటరీ విక్రమ్ దుహాన్ ధృవీకరించారు.

Next Story