'నేను అదే గదిలో ఉన్నాను'.. భారత్-పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ పదే పదే చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను తోసిపుచ్చిన‌ జైశంకర్

భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర‌ ఉద్రిక్తతలు నెల‌కొన్న స‌మ‌యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జ‌రిగిన‌ట్లు ప్రకటించారు.

By Medi Samrat
Published on : 1 July 2025 2:25 PM IST

నేను అదే గదిలో ఉన్నాను.. భారత్-పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ పదే పదే చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌ను తోసిపుచ్చిన‌ జైశంకర్

భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర‌ ఉద్రిక్తతలు నెల‌కొన్న స‌మ‌యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జ‌రిగిన‌ట్లు ప్రకటించారు. అయితే.. ఈ వాదనను తాజాగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పూర్తిగా తోసిపుచ్చారు. న్యూయార్క్‌లోని న్యూస్‌వీక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ.. మేలో భారత్ చేప‌ట్టిన ఆపరేషన్ సింధూర్ మొత్తం కథను, తరువాత జరిగిన సంఘటనలను వివరించాడు.

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఫోన్‌లో మాట్లాడినప్పుడు తాను ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి గదిలో ఉన్నానని జైశంకర్ చెప్పారు. వాణిజ్యం, కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి చర్చ జ‌ర‌గ‌లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. పాకిస్థాన్ బెదిరింపులను తిప్పికొట్టిన భారత్.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి వైఖరి తీసుకుందన్నారు.

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి కాల్ వచ్చినప్పుడు నేను గదిలో ఉన్నాను. ఈ సమయంలో వాణిజ్యం, కాల్పుల విరమణ గురించి ఎటువంటి చర్చ జరగలేదన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని 'ఆర్థిక యుద్ధం'గా అభివర్ణించిన జైశంకర్.. కశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేసి మత హింసను రెచ్చగొట్టే కుట్ర అని అన్నారు.

మే 9వ తేదీ రాత్రి భారత్‌పై పాకిస్థాన్ భారీ దాడి చేసిందని.. అయితే వెంటనే భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. మరుసటి రోజు ఉదయం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో జైశంకర్‌తో మాట్లాడి పాకిస్థాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా తన భారత కౌంటర్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైకి ఫోన్ చేసి కాల్పుల విరమణ కోసం అభ్యర్థించారు. "ఏమి జరిగిందో నేను స్వయంగా చూశాను" అని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.

వాణిజ్య ఒత్తిడిని పెంచ‌డం ద్వారా కాల్పుల విరమణకు అంగీకరించేలా భారత్, పాకిస్థాన్‌లను బలవంతం చేసిన‌ట్లు ట్రంప్ గత వారం హేగ్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా సోషల్ మీడియా సహాయంతో చాలాసార్లు ఇలాంటి వాదనలు చేశారు. ట్రంప్ పోస్టులో.. అబ్బాయిలు మీలో ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే వ్యాపారం ఉండదని నేను చెప్పానని వెల్ల‌డించ‌గా.. భార‌త్ దీనిని ఖండించింది.

Next Story