దేశంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు.. కొత్త నివేదిక ఏం చెబుతుందంటే..
భారతదేశంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలకు సంబంధించి ఆందోళనకరమైన పోకడలను కొత్త నివేదిక హైలైట్ చేసింది.
By Medi Samrat
భారతదేశంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలకు సంబంధించి ఆందోళనకరమైన పోకడలను కొత్త నివేదిక హైలైట్ చేసింది. నివేదిక ప్రకారం.. భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. జనాభా పెరుగుదల రేటును ఆత్మహత్యలు అధిగమించాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా.. వార్తా సంస్థ PTI ప్రకారం.. వార్షిక IC3 కాన్ఫరెన్స్, ఎక్స్పో 2024లో బుధవారం.. విద్యార్థుల ఆత్మహత్యలు.. భారతదేశంలో ఒక అంటువ్యాధి అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపింది. 'గత రెండు దశాబ్దాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే రెండింతలు ప్రమాదకర వార్షిక రేటుతో 4 శాతం పెరిగాయి' అని పురుషుల IC3 ఇన్స్టిట్యూట్ రూపొందించిన నివేదిక పేర్కొంది. 2022లో జరిగిన మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో పురుష విద్యార్థులే 53 శాతం ఉన్నారు. 2021- 2022 మధ్య విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గాయి.. విద్యార్థినులలో ఆత్మహత్యలు 7 శాతం పెరిగాయి.
విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు జనాభా పెరుగుదల రేటు ను మించిపోతున్నాయని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో 0-24 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గింది. అయితే విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుండి 13,044కి పెరిగింది.
నివేదిక ప్రకారం.. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ విద్యార్థుల ఆత్మహత్యలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. జాతీయ మొత్తంలో మూడింట ఒక వంతు ఈ రాష్ట్రాలలో ఆత్మహత్యలు నమోదవుతున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సమిష్టిగా 29 శాతం కేసులు ఉంటాయి. రాజస్థాన్ 10వ స్థానంలో ఉంది.