భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 11,77,607 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 30,256 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,478,419కి చేరింది. నిన్న ఒక్క రోజే 295 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,45,133కి చేరింది.
నిన్న 43,938 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,27,15,105కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,18,181 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.72శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.57 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజే 37,78,296 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం 80,85,68,144 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.