దేశంలో త‌గ్గిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

India Corona Cases Update. దేశంలో న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల్లో స‌గానికిపైగా ఒక్క కేర‌ళ రాష్ట్రంలోనే న‌మోదు

By Medi Samrat  Published on  6 Sep 2021 4:40 AM GMT
దేశంలో త‌గ్గిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

దేశంలో న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల్లో స‌గానికిపైగా ఒక్క కేర‌ళ రాష్ట్రంలోనే న‌మోదు అవుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేర‌ళ‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. తాజాగా దేశంలో 38 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. కేర‌ళ రాష్ట్రంలో దాదాపు 26 వేల కేసులు న‌మోదు అయ్యాయంటే.. ఆ రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. గ‌డిచిన 24 గంట‌ల్లో 14,10,649 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 38,948 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు సోమ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.30 కోట్ల‌కికి చేరింది. నిన్న ఒక్క రోజే 219 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 4,40,752కి చేరింది.

24 గంట‌ల వ్య‌వ‌ధిలో 43,903 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,21,81,995కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 4,04,874 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.44శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.58శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా ఉంద‌ని ఆరోగ్యశాఖ పేర్కొంది. జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 25.23లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 68.75 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.


Next Story