మళ్లీ పెరిగిన కరోనా కేసులు..
India Corona Cases Update. దేశంలో రోజువారి కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే నేడు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 19,21,450
By Medi Samrat Published on 1 July 2021 5:27 AM GMT
దేశంలో రోజువారి కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే నేడు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 19,21,450 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 48,786 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,11,634కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,005 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,99,459కి పెరిగింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) July 1, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/iEM3pvCCuD pic.twitter.com/4yT0CaOsYS
నిన్న 61,588 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,94,88,918కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 5,23,257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.54శాతంగా ఉందని చెప్పింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 27,60,345 టీకాలు అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 33,57,16,019 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి