దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల్లో 20,66,285 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,57,299 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కి చేరింది.
నిన్న ఒక్క రోజే 4,194 మంది కరోనాతో మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,95,525కి చేరింది. నిన్న 3,57,630 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 2,30,70,365కి చేరింది. ప్రస్తుతం దేశంలో 29,23,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశంలో టీకా డ్రైవర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 19,33,72,819 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.