ఐఏఎస్ అధికారిణి ఇంట్లో కోట్లల్లో డబ్బులు

IAS Pooja Singhal, probed by ED in money laundering case. జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్ కేసులో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.

By Medi Samrat
Published on : 7 May 2022 9:00 PM IST

ఐఏఎస్ అధికారిణి ఇంట్లో కోట్లల్లో డబ్బులు

జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్ కేసులో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో 18 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ఇంట్లో రెండో రోజు కూడా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మ‌న్రేగా (ఉపాధి హామీ) నిధుల‌ను మైనింగ్ పేరుతో దుర్వినియోగం చేసిన‌ట్లు పలువురు వ్యక్తులపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఐఏఎస్ పూజా సింఘాల్ ఇంటి నుంచి 19 కోట్ల న‌గ‌దు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం రూ.25 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.

సింఘాల్ భర్త అభిషేక్ ఇంట్లో, ఆయన నిర్వహిస్తున్న ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో ఇంకా దాడులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాంచీ, చండీఘ‌డ్‌, ముంబై, కోల్‌క‌తా, ముజాఫ‌ర్‌పుర్‌, ఎన్సీఆర్‌, నోయిడా, ఫ‌రీదాబాద్, గురుగ్రామ్‌లో సోదాలు జ‌రిగాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఆ రాష్ట్ర మైనింగ్ మంత్రిగా కూడా కొన‌సాగుతున్నారు. ఐఏఎస్ పూజా సింఘాల్ మైన్స్ జియాలజీ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. గర్వాలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్నారు.







Next Story