హిందూ మహిళ తన ఆస్తిని పుట్టింటి సభ్యులకు ఇవ్వవచ్చు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Hindu woman can give her property to father's family. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆస్తి విషయంలో సంచలన తీర్పు.

By Medi Samrat  Published on  24 Feb 2021 10:22 AM GMT
Hindu woman can give her property to father’s family

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆస్తి విషయంలో సంచలన తీర్పునిచ్చింది. దేశంలో ప్రతి మహిళ తన తండ్రి నుంచి వచ్చిన వారిని ఆమె ఆస్తికి వారసులుగా తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. తన పుట్టింటి వారిని కుటుంబ సభ్యులుగా అంగీకరించవచ్చని స్పష్టం చేసింది. హిందువుల వారసత్వ చట్టం ప్రకారం సెక్షన్‌ 15.1 డి పరిధిలోకి వస్తారని, తండ్రి తరపున కుటుంబ సభ్యులు కూడా ఆస్తికి వారసత్వంగా తీసుకోవచ్చని తెలిపింది.

1956లో హిందూ వారసత్వ చట్టం ప్రకారం ప్రతి మహిళ తండ్రి కుటుంబ సభ్యులు వారసుల పరిధిలోకి వస్తారని తీర్పు వెల్లడించింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం సెక్షన్‌ 13.1 డీ ద్వారా తండ్రి వారసులను తన ఆస్తి వారసులుగా తీసుకోవచ్చని, వారు ఆస్తిని పొందేందుకు వీలుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కానీ స్త్రీ తండ్రి నుంచి వారసులుగా వచ్చినప్పుడు ఆస్తిని ఎవరు సంపాదించినా తండ్రి కుటుంబ సభ్యులు ఆ ఆస్తికి కూడా కుటుంబ సభ్యులవుతారని వెల్లడించింది.

కాగా, జగ్నో అనే మహిళ తన భర్త ఆస్తిని పొందడంపై కేసు నమోదైన నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. ఆమె భర్త 1953లో మరణించాడు. వారికి సంతానం లేకపోవడంతో ఆమెకు వ్యవసాయ ఆస్తిలో సగం వాటా వచ్చింది. సెక్షన్‌ 14 ప్రకారం, 1956 వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆ ఆస్తికి వారసురాలు అయ్యింది. దీని తర్వాత ఆమె ఆ ఆస్తి కోసం ఒక ఒప్పందం కుదుర్చుకొని తన సోదరుడి కొడుకులకు ఆస్తి ఇచ్చింది. దీంతో ఆమె భర్త సోదరుడి కొడుకులు ఆ ఆస్తి తమకు చెల్లుతుందని, వారి ఆస్తి వారికి ఇవ్వాలని 1991లో సివిల్‌ కోర్టులో దావా వేశారు. తన భర్త ఆస్తిని ఆమె సోదరులకు ఇచ్చేందుకు ఆమోదించాలని జగ్నో తిరిగి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అదే సమయంలో ఆమె భర్త సోదరుడి కుమారులు అందుకు అంగీకరించలేదు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు హిందూ వితంతువు తన తండ్రి కుటుంబంతో తిరిగి ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదని, ఆమె భర్త ఆస్తిని ఆమె సోదరుడి కొడుకుల పేరు మీద చేయలేమని స్పష్టం చేసింది. అయితే ఆస్తి అనేది ఇప్పటికే ఆస్తిలో హక్కు ఉన్నవారితో మాత్రమే ఈ సమస్య పరిష్కరించుకోవాలని తెలిపింది. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అనంతరం జగ్నో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 15.1డీ ప్రకారం హిందూ మహిళా తన తండ్రి బంధువులు, కుటుంబ సభ్యులు తనకు బయటివారు కాదని.. వారు కూడా ఆమె కుటుంబంలోని సభ్యులేనని పేర్కొంది.

చట్టంలో కుటుంబం అనే పదానికి సంకుచిత అర్థం ఇవ్వలేమని.. చట్టంలో హిందూ మహిళ కుటుంబం పట్ల కూడా వివరణ ఉందని తెలిపింది. ఇప్పటికే హక్కులను సృష్టించిన ఆస్తిపై ఏదైనా సిఫారసు డిక్రీ ఉంటే, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 17.2 కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.


Next Story