ఆర్మీ క్యాంపుపై గ్రెనేడ్ దాడికి విఫ‌ల‌య‌త్నం.. తృటిలో..

Grenade Blast Outside Army Cantonment Gate In Punjab's Pathankot. పఠాన్‌కోట్‌లోని ఆర్మీ కంటోన్మెంట్ గేటు బయట గ్రెనేడ్ పేలుడు సంభవించింది

By Medi Samrat
Published on : 22 Nov 2021 11:15 AM IST

ఆర్మీ క్యాంపుపై గ్రెనేడ్ దాడికి విఫ‌ల‌య‌త్నం.. తృటిలో..

పఠాన్‌కోట్ (పంజాబ్): పఠాన్‌కోట్‌లోని ఆర్మీ కంటోన్మెంట్ గేటు బయట గ్రెనేడ్ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు. కంటోన్మెంట్‌లోని త్రివేణి గేటు ముందు ఆదివారం అర్థరాత్రి జరిగిన పేలుడులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వారు తెలిపారు. కొందరు గుర్తుతెలియని ద్విచక్రవాహనదారులు సైనిక ప్రాంతం ముందు గ్రెనేడ్‌ను విసిరారని, సీసీటీవీ చిత్రాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.

సోమవారం తెల్లవారుజామున పఠాన్‌కోట్‌లోని ధీరాపుల్ సమీపంలోని భారత సైన్యానికి చెందిన త్రివేణి గేట్ వద్ద గ్రెనేడ్ పేలుడు సంభవించింది. కంటోన్మెంట్‌లోని త్రివేణి గేటు ముందు కొందరు గుర్తుతెలియని ద్విచక్రవాహనదారులు గ్రెనేడ్‌ను విసిరేశారని ఘటనా స్థలం నుంచి లభించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. "పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంప్‌లోని త్రివేణి గేట్ సమీపంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. తదుపరి విచారణ జరుగుతోంది. CCTVల ఫుటేజీని పరిశీలిస్తాము" అని పఠాన్‌కోట్ SSP సురేంద్ర లాంబాను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI తెలిపింది.

స్థానిక పోలీసు అధికారులు ఘటనా స్థలం నుంచి గ్రెనేడ్ భాగాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ జరుగుతుండగా, ఘటనకు సంబంధించిన తదుపరి సమాచారాన్ని పోలీసులు వెల్లడించలేదు. పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. జనవరి 2016లో, భారత వైమానిక దళానికి చెందిన పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై భారీగా సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో ఇద్దరు భద్రతా దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయాలతో కొన్ని గంటల తర్వాత మరణించారు.




Next Story