దక్షిణ గోవాలో ముగ్గురు వ్యక్తుల నుండి సుమారు రూ. 10 కోట్ల విలువైన తిమింగలం వాంతి లేదా ఆంబర్గ్రిస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సంగుయెమ్ గ్రామంలో పోలీసులు ఒక కారును అడ్డగించి, పెర్ఫ్యూమ్ పరిశ్రమలో ఉపయోగించే 5.75 కిలోల మైనపు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్పెర్మ్ తిమింగలాల ప్రేగులలో ఆంబర్గ్రిస్ ఉత్పత్తి అవుతుంది, వీటిని వన్యప్రాణుల రక్షణ చట్టంలోని షెడ్యూల్ II కింద ఉంచారు. భారతదేశంలో వాటి ఉప ఉత్పత్తుల వ్యాపారం లేదా ఇతర వాటికి వాడడం నిషేధించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ తిమింగలం వాంతి దాదాపు రూ. 10 కోట్లు ధర పలుకుతుందని పోలీసు ప్రతినిధి తెలిపారు. గోవాకు చెందిన సాయినాథ్ షెట్ (50), రత్నకాంత్ కరాపుర్కర్ (55), మహారాష్ట్రలోని సింధుదుర్గ్కు చెందిన యోగేష్ రెడ్కర్ (40) అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు, ఆ అంబెర్గ్రిస్ మూలాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.