దేశవ్యాప్తంగా రికార్డుస్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Fuel prices hiked yet again. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్ర‌వారం నాడు పెట్రోల్‌, డీజిల్‌పై

By Medi Samrat  Published on  23 Jan 2021 4:06 AM GMT
దేశవ్యాప్తంగా రికార్డుస్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్ర‌వారం నాడు పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్కో లీట‌ర్‌కు 25 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. నేడు మరో 25 పైసలు వడ్డించాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డుస్థాయికి చేరాయి. కాగా, చమురు కంపెనీలు గత 22 రోజులుగా క్రమం తప్పకుండా ధరలు పెంచుతూ వస్తున్నాయి.

తాజాగా పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.85.70కు చేర‌గా, డీజిల్‌ ధర రూ.75.88కి పెరిగింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో పెట్రో ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఇక తాజా పెరుగుద‌ల‌తో ముంబైలో పెట్రోల్ ధ‌ర‌‌ రూ. 92.28, డీజిల్ ధ‌ర‌‌ రూ.82.66కి చేరాయి. ఇక‌ జైపూర్‌లో దేశంలోనే అత్యధికంగా పెట్రోల్‌ రూ.93.08కు చేర‌గా.. డీజిల్ ధ‌ర‌ రూ.85.15కు చేరింది.

ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర ధర రూ.89.15గా ఉండగా, డీజిల్ ధర రూ. 82.80కు చేరింది. బెంగళూరులో పెట్రోల్‌ రూ.88.59, డీజిల్‌ రూ.80.47, చెన్నైలో పెట్రోల్‌ రూ.88.38, డీజిల్‌ రూ.82.23, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.87.11, డీజిల్‌ రూ.79.48కి చేరాయి. పెరిగిన ధ‌ర‌ల‌తో సామాన్యుడు అడుగు బ‌య‌ట పెట్టాలంటేనే ఆలోచించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.మ‌రి ఈ ధ‌ర‌ల‌కు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎప్పుడు చెక్ పెడ‌తాయో చూడాలి మ‌రి.



Next Story