ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 10 రోజుల పాటు ఉచిత ప్రవేశం

Free entry to monuments for 10 days as part of Azadi Ka Amrit Mahotsav. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

By Medi Samrat  Published on  3 Aug 2022 1:16 PM GMT
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 10 రోజుల పాటు ఉచిత ప్రవేశం

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 5 నుంచి 15 వరకు సందర్శకులందరికీ ఉచితంగా పలు స్మారక చిహ్నాల ప్రాంతాలలోకి ఎంట్రీ లభించనుంది. టిక్కెట్టు తీసుకొని ఎంట్రీకి అవకాశం ఉన్న అన్ని కేంద్ర రక్షిత స్మారక ప్రాంతాలకు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15 తేదీలలో ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తామని భారత పురావస్తు శాఖ(ASI) బుధవారం తెలిపింది.

ఏ సందర్శకుడి (స్వదేశీ లేదా విదేశీయులు) నుండి ఎటువంటి ప్రవేశ రుసుము వసూలు చేయబడదని ASI తెలిపింది. ASI పరిధి లోని అన్ని మ్యూజియంలలో కూడా సందర్శకులందరికీ ఉచితంగా ప్రవేశం కల్పిస్తూ ఉన్నారు. ఈ నిర్ణయం హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోట, చార్మినార్.. ఇలా ASI కింద కేంద్ర ప్రభుత్వంచే రక్షించబడిన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టిక్కెట్టు పొందిన స్మారక చిహ్నాలకు వర్తిస్తుంది.


Next Story