వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్‌ను కలిసిన జగదీప్ ధంఖర్

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో మంగ‌ళ‌వారం మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ భేటీ అయ్యారు.

By -  Medi Samrat
Published on : 18 Nov 2025 4:21 PM IST

వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్‌ను కలిసిన జగదీప్ ధంఖర్

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో మంగ‌ళ‌వారం మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత వీరిద్దరి అధికారిక సమావేశం ఇదే కావ‌డం విశేషం. జగదీప్ ధన్‌ఖర్ అనారోగ్య కారణాలను చూపుతూ.. జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరిగాయి.

విలాసవంతమైన వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లో నివసించిన మొదటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ఈ మధ్యాహ్నం రాధాకృష్ణన్‌ను కలిశారని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌లో సీపీ రాధాకృష్ణన్‌ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వీరిద్దరి భేటీ ఇదే తొలిసారి. రాష్ట్రపతి భవన్‌లో రాధాకృష్ణన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జగ్‌దీప్ ధంఖర్ చివరిసారిగా కలిశారు.

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మౌలానా ఆజాద్ రోడ్డులోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఉంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్.. కొత్త అధికారిక నివాసంగా మారింది. ఈ 13 ఎకరాల ఆస్తిలో మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ మొదట‌గా ఉన్నారు.

భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ సెప్టెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. సీపీ రాధాకృష్ణన్ ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో ఆయనకు మొత్తం 452 ఓట్లు వచ్చాయి. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరిగింది. ఈ ఎన్నికల్లో 14 మంది ఎంపీలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరూ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లు.

Next Story