రైల్వే బ్రిడ్జిపై పేలుడు.. స్పందించిన సీఎం..

Explosion causes cracks on Udaipur-Ahmedabad railway track. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలోని జావర్-మైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌పై శని

By Medi Samrat  Published on  13 Nov 2022 10:43 AM GMT
రైల్వే బ్రిడ్జిపై పేలుడు.. స్పందించిన సీఎం..

రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలోని జావర్-మైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌పై శని, ఆదివారాల మధ్య రాత్రి సమయంలో పేలుడు సంభవించింది. అసర్వా-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లాల్సిన కొన్ని గంటల ముందు ఈ ఘటన జరిగింది. అంతరాయం కారణంగా దుంగార్‌పూర్‌లో రైలును నిలిపివేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్‌లో "ఉదయ్‌పూర్-అహ్మదాబాద్ రైలు మార్గంలోని ఓడా రైల్వే వంతెనపై రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్న సంఘటన ఆందోళన కలిగిస్తుంది. సీనియర్ పోలీసు, పరిపాలన అధికారులు సంఘటన స్థలంలో ఉన్నారు. ఈ ఘటనపై తనిఖీలు చేయాలని డీజీ పోలీసులను ఆదేశించారు. వంతెన పునర్నిర్మాణానికి రైల్వే పూర్తిగా సహకరిస్తుంది. ఈ మార్గంలోని రైలు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

శనివారం రాత్రి ఓడా రైల్వే బ్రిడ్జిపై పేలుడు శబ్దం వినిపించిందని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అనిల్ విష్ణోయ్ తెలిపారు. స్థానిక గ్రామస్తులు ఉదయం ట్రాక్‌ను చూసేందుకు అక్కడికి చేరుకోగా, ట్రాక్‌ విరిగిపోయి చాలా నట్‌ బోల్ట్‌లు కూడా కనిపించలేదు. గనిలో ఉపయోగించిన పేలుడు పదార్థాలను ట్రాక్‌ను దెబ్బతీయడానికి ఉపయోగించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సంఘటన స్థలం నుండి నమూనాలను సేకరించారు. "ఈ సంఘటన గురించి స్థానికులు రైల్వే అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. అసర్వా (అహ్మదాబాద్) నుండి ఉదయం 6.30 గంటలకు ఉదయ్‌పూర్‌కు బయలుదేరిన రైలును దుంగార్‌పూర్‌లోనే నిలిపివేశారు" అని SHO తెలిపారు. విధ్వంసకాండపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, ట్రాక్‌లను పునరుద్ధరించే పని ప్రారంభించామని ఉదయపూర్ పోలీసు సూపరింటెండెంట్ వికాస్ శర్మ తెలిపారు.


Next Story