ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపేనా.!

Exit polls.. BJP set to retain UP with reduced majority. ఐదు రాష్ట్రాలలో ఏడు దశల అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగియడంతో.. ఎగ్జిట్ పోల్స్ ఉత్తరప్రదేశ్‌లో బిజెపి, దాని

By అంజి  Published on  8 March 2022 2:33 AM GMT
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపేనా.!

ఐదు రాష్ట్రాలలో ఏడు దశల అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగియడంతో.. ఎగ్జిట్ పోల్స్ ఉత్తరప్రదేశ్‌లో బిజెపి, దాని మిత్రపక్ష పార్టీలు తక్కువ మెజారిటీతో స్పష్టమైన విజయం సాధించవచ్చని అంచనా వేసింది. ఈ సారి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్న చాలా ఏజెన్సీల ప్రకారం.. ఉత్తరాఖండ్, గోవాలో కాంగ్రెస్ - బిజెపి మధ్య గట్టి పోటీ ఉండగా, పంజాబ్‌లో ఆప్ కాంగ్రెస్‌ను గద్దె దింపుతుందని భావిస్తున్నారు. మణిపూర్‌లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాషాయ పార్టీ, దాని మిత్రపక్షాలు ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌, జేడీయూ - కాంగ్రెస్‌పై ఎడ్జ్‌ను కలిగి ఉంటాయి. పంజాబ్‌లో ఇండియా టుడే యాక్సిస్ పోల్ 117 సీట్ల అసెంబ్లీలో ఆప్‌కి 76-90 సీట్లు, కాంగ్రెస్‌కు 19-31 సీట్లు, బీజేపీకి 1-4 సీట్లు, ఎస్‌ఏడీకి 7-11 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

పోల్‌స్ట్రాట్ ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని 403 సీట్లలో బీజేపీ, మిత్రపక్షాలు 211-225 స్థానాలను గెలుచుకుంటాయి. ఎస్‌పీ, దాని మిత్రపక్షాలు 146-160, బీఎస్పీ 14-24, కాంగ్రెస్‌కు 4-6 సీట్లు లభిస్తాయి. టైమ్స్ నౌ-వీటో అంచనా ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో బీజేపీ 37 సీట్లు, కాంగ్రెస్‌కు 31 సీట్లు వస్తాయని అంచనా. 40 సీట్ల గోవా అసెంబ్లీలో, కాంగ్రెస్‌కు 16 సీట్లు వస్తాయని అంచనా వేయగా, బీజేపీకి 14 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ-వీటో ఎగ్జిట్ పోల్స్ చూపించింది. అదే సమయంలో, మణిపూర్‌లో బిజెపికి 23 - 28 మధ్య. కాంగ్రెస్‌కు 10 - 14 మధ్య స్థానాలు మారుతాయని ఇండియా న్యూస్ అంచనాలు చెబుతున్నాయి. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story