ముఖ్యమంత్రి కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి

Eggs hurled at Odisha CM Navin Patnaik's convoy in Puri. ముఖ్యమంత్రి కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేశారు. శ్రీమందిర్ పరిక్రమ ప్రాజెక్టుకు

By Medi Samrat  Published on  24 Nov 2021 12:05 PM GMT
ముఖ్యమంత్రి కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి

ముఖ్యమంత్రి కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేశారు. శ్రీమందిర్ పరిక్రమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి తిరిగి వస్తుండగా పూరీలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై గుడ్లు విసిరారు. పూరీలోని హాస్పిటల్ ఛక్ సమీపంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు గుడ్లు విసరడమే కాకుండా నల్ల జెండాలు కూడా ప్రదర్శించారు. కార్యకర్తలు "నవీన్ పట్నాయక్ డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేస్తూ ఆయన పర్యటనను వ్యతిరేకించారు.

మమితా మెహెర్ హత్యలో హోం శాఖ సహాయ మంత్రి దిబ్యా శంకర్ మిశ్రా సహకరించారనే ఆరోపణలపై బీజేపీ నిరసన కార్యక్రమాలకు దారి తీసింది. అంతకుముందు రోజు, పూరీలోని బడా దందాపై నల్లజెండాలు ఊపినందుకు భారతీయ జనతా యువమోర్చా (BJYM) మరియు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) కార్యకర్తలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. BJYM, ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య మాట్లాడుతూ కళంకిత మంత్రి దిబ్యా శంకర్ మిశ్రాను బహిష్కరించకపోయినా లేదా అతనిపై ఎటువంటి చర్య తీసుకోకపోతే ఇవే నిరసనలు కొనసాగుతాయని అన్నారు.


Next Story