అర్థరాత్రి ఢిల్లీలో భూకంపం

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆదివారం అర్థరాత్రి భూకంపం సంభవించింది.

By Medi Samrat
Published on : 8 Jun 2025 9:13 AM IST

అర్థరాత్రి ఢిల్లీలో భూకంపం

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆదివారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.3గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం ఆగ్నేయ ఢిల్లీలో ఉంది. ప్రస్తుతం ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. శనివారం, ఆదివారం మధ్య రాత్రి 1.27 గంటలకు భూకంపం సంభవించింది. ఆ సమయంలో ప్రజలు నిద్రపోతున్నారు.. అందువల్ల ప్రజలకు ప్రకంపనలు అంత‌గా తెలియ‌రాలేదు. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల లోతులో ఉంది.

Next Story