అరెస్టైన ఢిల్లీ మంత్రికి హైకోర్టు షాక్‌

Delhi HC stays order permitting lawyer's presence during Satyendar Jain's ED questioning. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ విచారించే సమయంలో న్యాయవాది

By Medi Samrat  Published on  4 Jun 2022 3:30 PM GMT
అరెస్టైన ఢిల్లీ మంత్రికి హైకోర్టు షాక్‌

ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ విచారించే సమయంలో న్యాయవాది హాజరు కావడానికి అనుమతిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు శనివారం స్టే విధించింది. జస్టిస్ యోగేష్ ఖన్నాతో కూడిన సింగిల్ బెంచ్ శుక్రవారం తీర్పును రిజర్వ్ చేసింది. జైన్‌పై ఎఫ్‌ఐఆర్ లేదా ఫిర్యాదు లేనందున తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసే సమయంలో తన న్యాయవాదుల ఉనికిని క్లెయిమ్ చేయలేరని న్యాయమూర్తి శనివారం తెలిపారు. దీని వల్ల నిందితుడిగా ఆ హక్కును జైన్ పొందలేకపోయారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన సత్యేంద్ర జైన్‌ను మే 31న ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ జూన్ 9 వరకు కస్టడీకి పంపారు. అయితే జైన్ తరఫు న్యాయవాది హాజరుకావడానికి సీబీఐ కోర్టు అనుమతించింది. "వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. నిందితుడి విచారణ సమయంలో అత‌ని తరపు న్యాయవాది సురక్షితమైన దూరంలో ఉండటానికి అనుమతించాలంటూ నిర్దేశించింది, అక్కడ న్యాయ‌మూర్తి నిందితుడిని చూడగలడు కాని అతని మాట వినడ‌ని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ.. ఈ షరతు తమకు మంజూరైన కస్టడీని ప్రేరేపిస్తుంద‌ని అని ఈడీ కౌంట‌ర్ సమర్పించింది. ఈ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు శుక్రవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.










Next Story