జూన్ 6, శనివారం బక్రీద్ వేడుకలకు ముందు ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆంక్షలను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో జంతు బలి, అటువంటి చర్యలను చిత్రీకరించే ఫోటోలు లేదా వీడియోల ప్రసారంను నిషేధిస్తూ సలహాను జారీ చేసింది. ప్రజా పరిశుభ్రతను కాపాడటం, పండుగ సమయంలో మతపరమైన ఉద్రిక్తతలను నివారించడం ఈ చర్యల లక్ష్యమని అధికారులు తెలిపారు.
"జీరో టాలరెన్స్" విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మార్గదర్శకాలను పాటించని వారిపై వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీసు బృందాలను ఇప్పటికే ఆదేశించినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ అడ్వైజరీ ప్రకారం పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, అనుమతులు లేని ప్రాంతాలలో జంతు బలిని స్పష్టంగా నిషేధిస్తుంది. ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జంతువులను వధించిన ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేయవద్దని సూచించారు. చట్టం ప్రకారం రక్షించబడిన, బలి ఇవ్వడానికి అనుమతించబడని ఆవులు, దూడలు, ఒంటెలు, ఇతర జంతువులను చట్టవిరుద్ధంగా వధించకూడదని కూడా నోటీసుల్లో తెలిపారు. అడ్వైజరీ కాపీని అన్ని డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్ (MCD)-డెవలప్మెంట్ కమిషనర్కు పంపారు.