Delhi Election Result 2025 : ఫలించని 'ఒవైసీ' మాయాజాలం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది.

By Medi Samrat  Published on  8 Feb 2025 11:30 AM IST
Delhi Election Result 2025 : ఫలించని ఒవైసీ మాయాజాలం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ట్రెండ్స్ ప్రకారం, న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ కేవలం 250 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. AIMIM పోటీ చేయ‌డంతో ఆప్ ఓట్లలో కొంత‌ చీలిక వ‌స్తుంద‌ని అంతా భావించారు. అయితే పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఒక స్థానంలో AIMIM అభ్యర్థి 5వ స్థానంలో ఉన్నారు. ఓఖ్లా నుంచి ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ చాలా వెనుకబడి ఉన్నారు. అమానతుల్లా 2,500 ఓట్లతో వెనుకబడ్డారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మనీష్ చౌదరి ముందంజలో ఉన్నారు. ముస్తఫాబాద్, బల్లిమారన్‌లలో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముస్తఫాబాద్‌లో బీజేపీ అద్భుతం చేసింది. బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్త్ 16,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఆప్‌కి చెందిన అదీల్ అహ్మద్ ఖాన్ వెనుకబడి ఉన్నారు.

Next Story