తమిళనాడు రాష్ట్రం లోని ఒక పట్టణంలో కాకులు చనిపోతూ ఉండడం అక్కడి ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది. డూండిగల్ జిల్లాలోని వేదసందూర్లో గత కొన్ని రోజులుగా అనేక కాకులు మరణించడం స్థానిక ప్రజల్లో భయాలను రేకెత్తించింది. అయితే అధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ మరణాల సంఖ్య వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
100 కు పైగా కాకుల సామూహిక మరణాలు సంభవించాయనే నివేదికలను కూడా అధికారులు తోసిపుచ్చారు. ఇటీవల ఒకటి లేదా రెండు కాకులు మరణించినప్పటికీ, ఫిబ్రవరి 8న మాత్రమే, ఆరు నుండి ఏడు కాకులు చనిపోయాయని, ఇది ప్రజలకు కొంత ఆందోళన కలిగించిందని తెలిపారు. వేదసందూర్ తాలూకా అనేక పురాతన చెట్లకు నిలయంగా ఉంది. ఇక్కడ కాకులు సహా పెద్ద సంఖ్యలో పక్షులను ఆకర్షిస్తాయని అధికారులు తెలిపారు.