ఐదు పులుల ప్రాణాలు తీసిన మ‌నిషి ప‌గ‌..!

కర్ణాటకలో ఐదు పులులను చంపడం వెనుక ఓ వ్యక్తి పగ ఉంది.

By Medi Samrat
Published on : 28 Jun 2025 3:27 PM IST

ఐదు పులుల ప్రాణాలు తీసిన మ‌నిషి ప‌గ‌..!

కర్ణాటకలో ఐదు పులులను చంపడం వెనుక ఓ వ్యక్తి పగ ఉంది. తన పెంపుడు ఆవును పులి చంపిందన్న ప్రతీకారంతో పులుల ప్రాణాలు తీశాడని అటవీశాఖ దర్యాప్తులో తేలింది. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లా, మలెమహదేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో కొద్ది రోజుల క్రితం ఒక తల్లి పులి, నాలుగు కూనలు మరణించాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టారు అధికారులు.

మాదురాజు అనే వ్యక్తి, తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న 'కించి' అనే ఆవును ఇటీవల ఓ పులి వేటాడి చంపింది. పులిపై పగ పెంచుకున్న మాదురాజు, ఎలాగైనా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన కోనప్ప, నాగరాజుల సహాయంతో పులి దాడిలో చనిపోయిన తన ఆవు కళేబరానికి విషం పట్టించి, దాన్ని అటవీ ప్రాంతానికి సమీపంలో వదిలేశాడు. ఆ విషపూరితమైన మాంసాన్ని తిన్న తల్లి పులి, దాని నాలుగు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. అటవీశాఖ అధికారులు తమ దర్యాప్తులో మాదురాజే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గుర్తించారు. అతడితో పాటు సహకరించిన స్నేహితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Next Story