అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్.. ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపబోతోందంటే..

Covid-19 third wave will peak in October. భారత్ కు కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచివుంది. భారత్ లోకి అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్

By Medi Samrat  Published on  23 Aug 2021 7:57 AM GMT
అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్.. ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపబోతోందంటే..

భారత్ కు కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచివుంది. భారత్ లోకి అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ రావచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడిఎమ్) నిపుణుల కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఎన్‌ఐడిఎమ్ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. థర్డ్ వేవ్ తో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. మెరుగైన వైద్య సంసిద్ధత కోసం సన్నద్ధం కావాలని కేంద్రానికి సూచనలు చేసింది. పిల్లలకు వైద్య సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు, వైద్య పరికరాలు అవసరమైన స్థాయిలో అందుబాటులో లేవని నివేదికలో తెలిపింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 82% శిశువైద్యుల కొరత ఉందని.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63% ఖాళీలు ఉన్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొన్న డేటా గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే కోవిడ్ పరిస్థితి భయంకరంగా ఉంది, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, తగినంత వైద్య సదుపాయాలు, వ్యాక్సినేషన్ ఆలస్యం కావడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చని కేంద్రానికి ప్రధాని కార్యాలయానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఏయే రాష్ట్రాల్లో దీని ప్రభావం మొదలైంది, ఏ స్ధాయిలో ఉందన్న విషయాల్ని కూడా హోంశాఖ ప్యానెల్ పీఎంవోకు సమర్పించిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ 19 ధర్డ్ వేవ్ దూసుకొస్తోందని ఈ ప్యానెల్ రిపోర్టులో వెల్లడించింది. దీంతో భారత్ లో థర్డ్ వేవ్ ప్రభావంపై జనంలో ఆందోళనలు మరింత పెరగబోతున్నాయి.

ఎన్‌ఐడిఎమ్ నిపుణుల కమిటీలో సభ్యులుగా ఉన్న CSIR-IGIB డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్, ఎయిమ్స్ మాజీ డైరక్టర్ ఎంసీ మిశ్రా, భారతీయ శిశువైద్యుల సంఘం అధ్యక్షుడు నవీన్ ఠాకర్, ప్రొఫెసర్ గగన్ దీప్ కాంగ్, పట్టణ నిరాశ్రయులకు ఆశ్రయంపై రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ చైర్మన్ ఎకె పాండే ఉన్నారు. థర్డ్ వేవ్ ఫస్డ్, సెకండ్ వేవ్ లకు భిన్నంగా పెద్దలపై కంటే పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపబోతోందన్న హెచ్చరికలు తల్లితండ్రుల్ని నిద్రలేకుండా చేస్తున్నాయి. సెకండ్ వేవ్ తగ్గిందంటూ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు తెరిసేస్తున్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక విద్యార్ధుల తల్లితండ్రుల్లో అయోమయం నెలకొంది.


Next Story