మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. ఆ మహిళలను ఇంటి నుంటి బయటకి లాగి వారితో

Controversial remarks by Madhya Pradesh minister on Thakur women. ఠాకూర్ల మ‌హిళ‌ల‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ మంత్రి బిసాహులాల్‌ సింగ్‌ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఠాకూర్లు అని కూడా పిలువబడే రాజ్‌పుత్ కమ్యూనిటీ,

By అంజి  Published on  25 Nov 2021 2:02 PM GMT
మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. ఆ మహిళలను ఇంటి నుంటి బయటకి లాగి వారితో

ఠాకూర్ల మ‌హిళ‌ల‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ మంత్రి బిసాహులాల్‌ సింగ్‌ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఠాకూర్లు అని కూడా పిలువబడే రాజ్‌పుత్ కమ్యూనిటీ, ఇతర అగ్రవర్ణాల మహిళలను వారి ఇళ్ల నుండి బయటకు లాగి సమానత్వం కోసం సమాజంలో పనిచేసేలా చేయాలని మంత్రి అనడం పెద్ద వివాదానికి దారితీసింది. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి బిసాహులాల్ సింగ్.. ఠాకూర్, ఇతర అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు తమ మహిళలను తమ ఇళ్లకే పరిమితం చేశారని అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో బుధవారం జరిగిన మహిళల అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్ర మంత్రి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఠాకూర్-థాకర్ (అగ్ర కులాలు) వారి స్త్రీలను తమ ఇళ్లకే పరిమితం చేశారు. వారిని సమాజంలో పని చేయడానికి అనుమతించరు. ఠాకూర్‌ల మహిళలు, ఇతర పెద్ద వ్యక్తులను వారి ఇళ్ల నుండి బయటకు లాగి అందరికీ సమానత్వాన్ని కల్పించడం కోసం సమాజంలో పనిచేసేలా చేయాలి" అని సింగ్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కెకె మిశ్రా మాట్లాడుతూ.. ఇది మంత్రి బిసాహులాల్‌ సింగ్ వ్యక్తిగత అభిప్రాయమా లేదా తన ప్రభుత్వం తరపున ఈ ప్రకటన చేశారా అనేది స్పష్టం చేయాలి. అది తన ప్రభుత్వ అభిప్రాయం అయితే, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళలను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని అన్నారు.


Next Story