నీతి ఆయోగ్‌ సమావేశం అర్థరహితం.. ప్ర‌ధాని మోదీపై నిప్పులు చెరిగిన నితీష్‌

CM Nitish Kumar Called Meeting Of NITI Aayog With The New Parliament Meaningless. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధానిని వ్యతిరేకించిన జేడీయూ.

By Medi Samrat  Published on  27 May 2023 8:13 AM GMT
నీతి ఆయోగ్‌ సమావేశం అర్థరహితం.. ప్ర‌ధాని మోదీపై నిప్పులు చెరిగిన నితీష్‌

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధానిని వ్యతిరేకించిన జేడీయూ.. నీతి ఆయోగ్ సమావేశంలోనూ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. ఈ దేశ చరిత్రను మార్చేందుకు అధికారంలో కూర్చున్న వ్యక్తులే.. స్వయంగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తున్నారని.. అది అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశం అర్థరహితమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి మ‌ర‌ల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

శనివారం ఉదయం పాట్నాలో మీడియాతో మాట్లాడిన సీఎం నితీశ్ కుమార్.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త పార్లమెంట్ హౌస్ అవసరం ఏమిటని ఆయన ప్ర‌శ్నించారు. స్వేచ్ఛ ఉన్నట్లయితే.. అది ఎక్కడ నుండి మొదలైందో.. అక్క‌డే మరింత అభివృద్ధి చెందాలి. ప్రత్యేకంగా కొత్త భవనం కట్టినా ప్రయోజనం లేదు. మీరు చరిత్రను ఎలా మార్చుతారు? వేరు చేయాల్సిన అవసరం ఏముంది? పాత పార్లమెంటు భవనాన్నే అభివృద్ధి చేసి ఉండాల్సింది. రేపు పార్ల‌మెంట్ పూర్తిచేస్తే చరిత్ర ఎలా తెలుస్తుందని ప్ర‌శ్నించారు. ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి, రేపు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరైనా ప్రయోజనం లేదని అన్నారు.

ఇంతలో బీజేపీ నుంచి ఘాటైన ప్రకటన వచ్చింది. ఈ సమావేశానికి సీఎం నితీశ్ కుమార్ హాజరు కావాలి. ఆయన గైర్హాజరు కావడం వల్ల బీహార్ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా అన్నారు. ఆయన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై ఉంటే.. బీహార్ అభివృద్ధికి అవసరమైన విధానాలపై చర్చించి ఉండేవారు. కానీ, నితీష్ కుమార్ ఉద్దేశం బీహార్‌ను అభివృద్ధి చేయడం కాదు. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయ‌న‌ దూరం కావడానికి ఇదే కారణమ‌న్నారు.


Next Story