బెంగాల్‌కు ఎవరి భిక్ష అవసరం లేదు.. బడ్జెట్‌పై మమతా ఫైర్‌

పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.

By Medi Samrat  Published on  23 July 2024 11:20 AM GMT
బెంగాల్‌కు ఎవరి భిక్ష అవసరం లేదు.. బడ్జెట్‌పై మమతా ఫైర్‌

పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక బడ్జెట్ అని పేర్కొన్నారు. అసెంబ్లీలో విలేకరులతో మాట్లాడిన మమత.. సాధారణ బడ్జెట్‌లో బెంగాల్‌కు మళ్లీ సవతి తల్లి దౌర్జన్యమే జ‌రిగింద‌న్నారు. పశ్చిమ బెంగాల్‌పై ప్రధాని మోదీ అసూయపడుతున్నారని అన్నారు. బెంగాల్‌కు ఎవరి భిక్ష అవసరం లేదని మమతా బెనర్జీ అన్నారు. దీనికి బెంగాల్ ప్రజలు సమాధానం చెబుతారు. సామాన్యులకు, పేదలకు బడ్జెట్‌లో ఏమీ లేదని మమత అన్నారు. బెంగాల్ మళ్లీ పూర్తిగా వివక్షకు గురైంది.

బడ్జెట్‌లో బీహార్, ఆంధ్రప్రదేశ్‌లకు మాత్ర‌మే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చార‌నే వ్యాఖ్య‌ల‌కు మ‌మ‌తా మాట్లాడుతూ.. అంద‌కు మాకు అభ్యంతరం లేదని.. అయితే బెంగాల్‌తో సహా ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపవద్దని మమత అన్నారు. ఇది పూర్తిగా రాజకీయప‌ర‌మైన‌ బడ్జెట్. బెంగాల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ అసూయపడుతున్నారని మమత అన్నారు.

Next Story