ఓమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Centre extends Covid-related restrictions till January 31, 2022. దేశంలో పెరుగుతున్న కోవిడ్-19, ఓమిక్రాన్ వేరియంట్ కేసుల దృష్ట్యా.. దేశంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ సంబంధిత పరిమితులను 2022 జనవరి 31 వరకు

By అంజి  Published on  27 Dec 2021 9:54 AM GMT
ఓమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

దేశంలో పెరుగుతున్న కోవిడ్-19, ఓమిక్రాన్ వేరియంట్ కేసుల దృష్ట్యా.. దేశంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ సంబంధిత పరిమితులను 2022 జనవరి 31 వరకు కేంద్రం సోమవారం పొడిగించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో.. స్థానిక/జిల్లా అడ్మినిస్ట్రేషన్లు పరిస్థితిని వారి స్వంత అంచనా ఆధారంగా ఓమిక్రాన్‌ వేరియంట్ యొక్క ముప్పుకు వ్యతిరేకంగా తక్షణమే నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించబడింది. "పండుగ సీజన్‌లో రద్దీని నియంత్రించడానికి అవసరాల ఆధారిత స్థానిక పరిమితులను విధించడాన్ని రాష్ట్రాలు పరిగణించవచ్చు" అని ఆర్డర్ పేర్కొంది.

డిసెంబర్ 21న జారీ చేసిన మార్గదర్శకాలు జనవరి 31, 2022 వరకు పొడిగించబడతాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. డిసెంబర్ 21 మార్గదర్శకాలలో కోవిడ్-19 పరీక్షలో 10 శాతం కంటే ఎక్కువ సానుకూలత ఉన్నట్లయితే రాష్ట్రాలు/కేంద్ర రాష్ట్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా నియంత్రణ చర్యలను విధించాలని కేంద్రం పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.

"పరీక్ష, ట్రాక్, చికిత్స, టీకాలు వేయడం, కోవిడ్-సముచిత ప్రవర్తనకు కట్టుబడి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమవారం భారతదేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 578కి పెరిగింది. ఢిల్లీ , మహారాష్ట్రలో ఒక్కొక్కటి 142 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దూరదృష్టి, డేటా విశ్లేషణ, డైనమిక్ నిర్ణయం తీసుకోవడం, పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా స్థానిక, జిల్లా స్థాయిలలో కఠినమైన, సత్వర నియంత్రణ చర్యలు అవసరం" అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story