రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీహార్లో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సి)ను భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) రహస్యంగా అమలు చేస్తోందని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.
కొత్త ఓటర్ల నమోదు మార్గదర్శకాలకు జనన పత్రాలను తప్పనిసరిగా జారీ చేయాలని కోరడం వివక్షతతో కూడుకున్నవని, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల ఓటర్లు ఓటు హక్కును కోల్పోయేలా చేస్తాయని ఆయన విమర్శించారు. ఒవైసీ ఎక్స్ లో “ఎన్నికల కమిషన్ బీహార్లో బ్యాక్డోర్ ద్వారా NRCని అమలు చేస్తోంది. ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి, ప్రతి పౌరుడు ఇప్పుడు వారు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో నిర్ధారించే పత్రాలను మాత్రమే కాకుండా, వారి తల్లిదండ్రులు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో కూడా సమర్పించాల్సి ఉంటుంది. సీమాంచల్ వంటి వరద ప్రభావిత ప్రాంతాలలోని పేదల నుండి ఇటువంటి పత్రాలను ఆశించడం దారుణం" అని ఆయన అన్నారు.