ఢిల్లీ లిక్క‌ర్‌ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు

CBI Summons Arvind Kejriwal In Liquor Policy Case. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ విచారణకు పిలిచింది.

By Medi Samrat  Published on  14 April 2023 12:39 PM GMT
ఢిల్లీ లిక్క‌ర్‌ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు

CBI Summons Arvind Kejriwal In Liquor Policy Case


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ విచారణకు పిలిచింది. ఢిల్లీ లిక్క‌ర్‌ పాలసీ కేసుకి సంబంధించి ఈ విచారణ జరగవచ్చని చెబుతున్నారు. ఈ మేర‌కు సీబీఐ కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ చేసింది. ఏప్రిల్ 16న తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ కేజ్రీవాల్‌ను ఆదేశించింది. కొత్త మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతరం కేంద్రాన్ని విమ‌ర్శిస్తుంది.

అంతకుముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు గోవా పోలీసులు సమన్లు ​​కూడా జారీ చేశారు. ఏప్రిల్ 27వ తేదీ గురువారం హాజరు కావాలని సీఎం కేజ్రీవాల్‌ను పోలీసులు కోరారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఆస్తులు, బహిరంగ ప్రదేశాల్లో ఎన్నికల పోస్టర్లను అక్రమంగా అతికించడం, అమర్చడంపై గోవా పోలీసులు ఈ నోటీసును జారీ చేశారు. సమన్ల ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ పెర్నెం పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది.


Next Story