బైజూస్ యజమానిపై కేసు నమోదు..!

Case Against BYJU's Owner. ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ దేశంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వెళుతోంది. భారత క్రికెట్ జట్టుకు

By Medi Samrat  Published on  5 Aug 2021 9:55 AM GMT
బైజూస్ యజమానిపై కేసు నమోదు..!

ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ దేశంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వెళుతోంది. భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్ గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే.. తాజాగా బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్‌‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రిమోఫోబియా అనే సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు.

క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్.. యూపీఎస్‌సీకి సంబంధించి బైజూస్ తప్పుడు సమాచారాన్ని అందించిందని ఆరోపించారు. యుపీఎస్‌సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో సీబీఐని యుఎన్‌టీఓసీకి నోడల్ ఏజెన్సీగా చెప్పినట్లుగా వెల్లడించారు. ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఈ-మెయిల్ పంపినా.. బైజూస్‌ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు.

ఈ విష‌య‌మై బైజూస్‌ రవీంద్రన్ స్పందిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని తెలిపారు. భారత్ లో బాగా పాపులర్‌ ఎడ్యుకేషనల్‌ యాప్‌గా పేరొందిన బైజూస్‌.. తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇకపై అకడామిక్‌ ఓరియెంటెండ్‌ సర్వీసెస్‌ లను మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్‌, సర్టిఫికేట్‌ కోర్సులపై కూడా దృష్టి సారించనుంది.


Next Story