నవంబర్ 3న ఉప ఎన్నిక.. పోటీ నుంచి త‌ప్పుకున్న‌ బీజేపీ

BJP won't contest Andheri bypoll election, Murji Patel to withdraw nomination. నవంబర్ 3న జరగనున్న అంధేరి(ఈ) ఉప ఎన్నికకు ముర్జీ పటేల్ అభ్యర్థిత్వాన్ని

By Medi Samrat
Published on : 17 Oct 2022 2:50 PM IST

నవంబర్ 3న ఉప ఎన్నిక.. పోటీ నుంచి త‌ప్పుకున్న‌ బీజేపీ

నవంబర్ 3న జరగనున్న అంధేరి(ఈ) ఉప ఎన్నికకు ముర్జీ పటేల్ అభ్యర్థిత్వాన్ని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉపసంహరించుకుంది. ముర్జీ పటేల్ బిజెపీ, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఉమ్మడి అభ్యర్థి. ఉద్ధవ్ ఠాక్రే శివసేన అభ్యర్థి రుతుజా లత్కేపై తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే ప్రకటించారు. అంధేరీ ఈస్ట్ ఉపఎన్నికలో పోటీ చేయకూడదని బిజెపి నిర్ణయించుకుంది. బిజెపి నుండి నామినేషన్ దాఖలు చేసిన ముర్జీ పటేల్ దానిని ఉపసంహరించుకుంటారు. లేకుంటే మేము ఎన్నికల్లో గెలిచి ఉండేవాళ్లమని బవాన్‌కులే నాగ్‌పూర్‌లో అన్నారు.

ముంబైలోని అంధేరి (తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని నిలబెట్టవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే ఆదివారం భారతీయ జనతా పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థి రుతుజా లట్కేను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన ఉప ఎన్నికలో రమేష్ లట్కే భార్య రుతుజా లట్కేని బరిలోకి దింపింది. రమేష్ లట్కే మ‌ర‌ణంతో ఈ ఉప ఎన్నిక జ‌రుగుతుంది.


Next Story