సోనియా గాంధీపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

BJP moves EC, seeks immediate action against Cong, Sonia Gandhi over Karnataka ‘sovereignty’ remark. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఘాటైన ప్రకటనలు చేస్తున్నాయి.

By Medi Samrat  Published on  8 May 2023 8:48 AM GMT
సోనియా గాంధీపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Sonia Gandhi


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఘాటైన ప్రకటనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో హుబ్లీలో సోనియా గాంధీ చేసిన ప్రసంగంలో సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించడంపై దుమారం చెలరేగింది. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీలు ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రతినిధి బృందం కలిసింది.

కాగా, సోనియా గాంధీ కావాలనే సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో తుక్డే తుక్డే గ్యాంగ్ ఎజెండా కాబట్టి వారు అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారు. ఈ దేశ వ్యతిరేక చర్యపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామ‌న్నారు.

కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే కూడా సోనియా గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హుబ్లీలో చేసిన ప్రసంగంలో సోనియా గాంధీ కర్ణాటక సార్వభౌమాధికారం గురించి మాట్లాడారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. సార్వభౌమాధికారం అనే పదాన్ని దేశానికి మాత్రమే ఉపయోగిస్తారు. సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. 'ఈరోజు మేము సోనియా గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము. హుబ్లీలో ఆమె ప్రసంగిస్తూ.. కర్ణాటక సార్వభౌమాధికారం గురించి మాట్లాడారు. మేము దేశం కోసం సార్వభౌమాధికారాన్ని ఉపయోగిస్తాము. ఆమె 'తుక్డే-తుక్డే' ముఠాకు నాయకురాలు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

మే 6వ తేదీన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రచారం నిమిత్తం హుబ్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేయడంతోపాటు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 'కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమత్వం లేదా సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదు' అని అన్నారు.




Next Story