నా భార్య తల నరికేస్తామన్నారు: బండి సంజయ్‌

తెలంగాణలో జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అని నిరభ్యంతరంగా చెప్పగలిగే ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

By అంజి  Published on  30 Oct 2023 3:35 AM GMT
BJP, Bandi Sanjay, Telangana elections, Rajasingh, Hyderabad

నా భార్య తల నరికేస్తామన్నారు: బండి సంజయ్‌

తెలంగాణలో జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అని నిరభ్యంతరంగా చెప్పగలిగే ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దగ్గర సభకు సిద్ధమైనప్పుడు తనకు అనేక బెదిరింపు కాల్స్‌ వచ్చాయని సంజయ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో సభ నిర్వహిస్తే తన భార్య తలను నరికేసి బహుమతిగా ఇస్తామని, ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని ఆరోపించారు. అయినా వెనక్కి తగ్గకుండా సభను నిర్వహించామన్నారు.

''చాలా మంది బీజేపీ కార్యకర్తల్లాగే నా బెటర్ హాఫ్ నాకు అండగా నిలిచింది. ప్రాణం పోయినా ధర్మం కోసం పోరాడేందుకు వెనుకాడను. బీజేపీలో చాలా మంది కార్యకర్తలు ధర్మ పోరాటం చేస్తున్నారు'' అని సంజయ్‌ అన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకుడు రాజాసింగ్ ధర్మం కోసం పోరాడే మరో నాయకుడు. ఏడాది పాటు పార్టీకి దూరంగా ఉన్నా.. చంపేస్తామని బెదిరింపులు వచ్చినా.. హిందూ మతాన్ని వీడలేదు. అదే రాజా సింగ్‌ని నేడు గోషామహల్ నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు. ఈరోజు ఒవైసీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ కొడుకు, కూతురు సహా అందరూ భాగ్యలక్ష్మి గుడి గురించే మాట్లాడుతున్నారు.

కరీంనగర్‌లో బీజేపీ గెలుపు ఖాయమని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని, బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చిన కేసీఆర్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి చాలా రోజులుగా బీ ఫారం ఇవ్వడం మానేశారని అన్నారు. ఎందుకంటే ఆయనకు బీజేపీ గెలుపుపై ​​నివేదికలు వచ్చాయని, ఈ నివేదికల నేపథ్యంలో ఒవైసీ కేసీఆర్‌ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్‌ అన్నారు. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతు ఇస్తోందని అన్నారు. ముస్లిం ఓట్ల కోసం వెంపర్లాడిన వ్యక్తి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వక్ఫ్ భూములు, ముస్లింల భూములను కూడా ఆక్రమించుకుంటాడని, అందుకే ఈసారి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయకూడదని ముస్లిం ఓటర్లు నిర్ణయించుకున్నారని బండి సంజయ్‌ అన్నారు.

Next Story