ప్రతిపక్ష నేతగా ఎన్నికైన‌ మాజీ సీఎం అతీషి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

By Medi Samrat
Published on : 23 Feb 2025 2:36 PM IST

ప్రతిపక్ష నేతగా ఎన్నికైన‌ మాజీ సీఎం అతీషి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆప్ నేత గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. ఈరోజు జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో అతిషీని ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా తీర్మానించామని, కీల‌క‌ సమయంలో సీఎంగా ఢిల్లీ ప్రజలకు అతిశి సేవలందించారు. ఆరోగ్యవంతమైన ప్రతిపక్ష బాధ్యతను ఆప్ నిర్వర్తిస్తుందని అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీలో కాగ్‌ నివేదిక సమర్పించడంపై ఆప్‌ నేత అతిషి మాట్లాడుతూ.. 'సీఎంగా నేను కాగ్‌ నివేదికను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌కు పంపాను. ఈ కాగ్‌ నివేదికను ఎన్నికల ముందు సీల్డ్‌ కవరులో అసెంబ్లీకి పంపించాం. కాగ్ నివేదికను తమ తరపున అందజేస్తున్నట్లు భ్రమలు కల్పించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఢిల్లీ ప్రజల్లో వ్యాపిస్తున్న అపోహను ప్రజల ముందుకు తీసుకురావాల‌న్నారు.

Next Story