బీజేపీలోకి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

At least 6 MLAs likely to join BJP. గోవాలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే దిగంబర్ కామత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

By Medi Samrat  Published on  10 July 2022 1:38 PM GMT
బీజేపీలోకి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

గోవాలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే దిగంబర్ కామత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడానికి ఉన్నారని, వారు బీజేపీలో చేరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కనీసం ఆరు నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే పుకార్ల మధ్య, గోవా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ఇన్‌ఛార్జ్ దినేష్ గుండో రావు మాట్లాడుతూ, "కాంగ్రెస్ తన మొత్తం 11 మంది ఎమ్మెల్యేలను ఈ రోజు సాయంత్రం 6.45 గంటలకు పంజిమ్‌లో మీడియా ముందు పరేడ్ చేయనుంది" అని చెప్పుకొచ్చారు.

అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో మాట్లాడుతూ తాను బీజేపీలో చేరడం లేదని చెప్పారు. తమ ఎమ్మెల్యేలపై బీజేపీ గందరగోళం సృష్టిస్తోందని, పుకార్లు పుట్టించిందని ఆ పార్టీ ఆరోపించింది. కలంగుటే ఎమ్మెల్యే మైఖేల్ లోబో మాట్లాడుతూ, "నేను మా ఇంట్లో కూర్చున్నాను. ఈ చర్చల్లో నిజం లేదు. ఈ పుకార్లను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను ఎక్కడికీ వెళ్లడం లేదు." అని అన్నారు. ఈరోజు గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించి, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ ఖండించింది.









Next Story