గుజరాత్‌లో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత‌

గుజరాత్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

By Medi Samrat
Published on : 6 May 2025 3:33 PM IST

గుజరాత్‌లో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత‌

గుజరాత్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆకస్మిక వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 14 మంది మరణించారు. 16 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని 75 శాతానికి పైగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో బలమైన గాలులు వీచే అవ‌కాశం ఉంది. గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. 15 జిల్లాల్లో వర్షంతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అల‌ర్ట్ చేసింది.

గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాబోయే 5 రోజులలో దాదాపు అన్ని చోట్లా వర్షాభావ పరిస్థితుల మధ్య గరిష్ట ఉష్ణోగ్రత 3 నుండి 5 డిగ్రీలు తగ్గవచ్చు. ఈ సమయంలో మండే వేడి నుండి ప్ర‌జ‌ల‌కు ఉపశమనం ద‌క్క‌నుంది. అకాల వర్షాల కారణంగా నిన్న 14 మంది చనిపోయారు. వడోదరలో విద్యుత్ తీగలు, భవన శిథిలాలు పడి ముగ్గురు, అహ్మదాబాద్‌లో రిక్షాపై హోర్డింగ్ పడి ఒకరు, ఆరావల్లిలో పిడుగుపాటుకు ఇద్ద‌రు మృతి చెందారు. ప‌లు జిల్లాల‌లో కూడా మ‌ర‌ణాలు న‌మోద‌యిన‌ట్లు నివేదిక‌లు పేర్కొన్నాయి.

Next Story