'పవన్‌ భయంతో హైదరాబాద్‌కు పారిపోయాడు' : సీఎం హిమంత

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య వద్ద మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని ఆరోపించిన తర్వాత, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది.

By -  Medi Samrat
Published on : 7 April 2026 3:47 PM IST

పవన్‌ భయంతో హైదరాబాద్‌కు పారిపోయాడు : సీఎం హిమంత

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య వద్ద మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని ఆరోపించిన తర్వాత, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 7, మంగళవారం నాడు, అస్సాం క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఒక బృందం నిజాముద్దీన్‌లోని పవన్ ఖేరా ఇంటికి చేరుకుంది. వేధింపులకు గురవుతున్నట్లు అతని భార్య అస్సాం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అస్సాం పోలీసులు విచారణ నిమిత్తం అతని ఇంటికి వెళ్లింది. ఆయ‌న లేక‌పోవ‌డంతో సుమారు రెండు గంటల పాటు అక్క‌డే వేచిచూసింది. ఈ సమయంలో ఢిల్లీ పోలీసుల బృందం కూడా అతని నివాసంలో ఉంది.

సుమారు రెండు గంటల తర్వాత అస్సాం పోలీసులు పవన్ ఖేరా ఇంటిని విడిచి వెళ్లారు. ఘటనా స్థలంలో ఉన్న జర్నలిస్టులు అస్సాం పోలీసులను ప్రశ్నించగా, వారు ఈ విషయం విచారణలో ఉందని, దీనిపై మరింత వ్యాఖ్యానించలేమని తేల్చి చెప్పారు. విచార‌ణ‌కు వెళ్లే సమయంలో అస్సాం పోలీసు అధికారులు కొన్ని పత్రాలను పట్టుకుని కనిపించారు. అయితే, ఆ పత్రాలు ఏమిటో, వాటిని నిజంగా పవన్ ఖేరా ఇంటి నుంచే స్వాధీనం చేసుకున్నారో లేదో అనే విషయంపై ఎలాంటి నిర్ధారణ లేదు. పవన్ ఖేరా తన ఇంట్లో కనిపించకపోవడంతో అతను పారిపోయాడని హిమంత బిస్వా శర్మ అన్నారు.

"అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రింకీ భూయాన్ శర్మ వద్ద మూడు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని చూపించే పత్రాలు మా వద్ద ఉన్నాయి. మొదటిది యూఏఈ గోల్డెన్ కార్డ్, రెండవది ఆంటిగ్వా మరియు బార్బుడా పాస్‌పోర్ట్, మూడవది ఈజిప్టు పాస్‌పోర్ట్. ఈ పాస్‌పోర్ట్‌లలో రెండు ఇస్లామిక్ దేశాలకు చెందినవి, అయినప్పటికీ ఆమె బహిరంగంగా తన మత అనుబంధాన్ని చెప్పుకుంటూనే ఉంది" అని పవన్ ఖేరా ముఖ్యమంత్రి హిమంత భార్య రింకీ భూయాన్‌పై ఆరోపించారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇటీవల తన భార్యపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ ఒక హెచ్చరిక జారీ చేశారు. ఆయన, "పవన్ ఖేడా త్వ‌ర‌లో పవన్ పేడాగా మారతారు అని అన్నారు.

Next Story