మంకీ డ్యాన్స్ చేస్తున్నారు.. మహా సంక్షోభంపై ఒవైసీ కామెంట్స్
Asaduddin Owaisi's take on Maharashtra crisis. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారం మహారాష్ట్ర సంక్షోభంపై స్పందించారు.
By Medi Samrat Published on 25 Jun 2022 2:15 PM GMT
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారం మహారాష్ట్ర సంక్షోభంపై స్పందించారు. ఎమ్మెల్యేలను 'కోతులు' అని కామెంట్ చేశారు. జరుగుతున్న పరిణామాలపై 'కోతుల నృత్యంలా కనిపిస్తుంది.. ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దూకే కోతుల వలె వ్యవహరిస్తున్నారు' అని అభివర్ణించారు. శివసేన, అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ అంతర్గత వ్యవహారంలో తాను గానీ, తమ పార్టీ ప్రమేయం ఉండబోదని ఆయన చెప్పారు.
#WATCH | Let Maha Vikas Aghadi deliberate over this matter. We are keeping an eye on the unfolding drama... It looks like a dance of monkeys. They are acting like monkeys jumping from one branch to another: AIMIM chief Asaduddin Owaisi on the political crisis in Maharashtra pic.twitter.com/RUUc9xRyUb
— ANI (@ANI) June 25, 2022
"మహా వికాస్ అఘాదీని ఈ విషయంపై చర్చించనివ్వండి.. అది వారి సమస్య. నేనెందుకు అక్కడికి వెళ్లి ఏదో చెప్పాలి? మేము జరుగుతున్న డ్రామాపై నిఘా ఉంచాము" అని ఓవైసీ అన్నారు. మహా సంక్షోభంపై మాట్లాడాలి అని ఓ మీడియా ప్రతినిధి అడగడంతో ఒవైసీ ఈ విధంగా స్పందించారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, స్వతంత్ర శాసనసభ్యులతో కలిసి బిజెపి పాలిత గుజరాత్కు వెళ్లిపోవడంతో ఈ సంక్షోభం చెలరేగింది.