వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒవైసీ

బీహార్‌లోని కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన లోక్‌సభ ఎంపీ మహ్మద్ జావేద్ వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

By Medi Samrat
Published on : 4 April 2025 7:57 PM IST

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒవైసీ

బీహార్‌లోని కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన లోక్‌సభ ఎంపీ మహ్మద్ జావేద్ వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత.. ఎంపీ జావేద్ దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానాన్ని ఆశ్రయించి, బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జావేద్‌తో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ప్రతిపాదిత చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తున్నారు.

లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కూడా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుస్ ముస్లిమీన్ ఎంపీ ఒవైసీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. వక్ఫ్ సవరణ బిల్లు-2025ను ఏప్రిల్ 3న లోక్ సభ ఆమోదించడం గమనార్హం. ఏప్రిల్ 2న చర్చ ప్రారంభమైన తర్వాత దాదాపు 12 గంటలపాటు చర్చ జరిగింది. బిల్లుపై అర్థరాత్రి ఓటింగ్‌ అనంతరం అందులో ప్రతిపాదించిన సవరణల అనంతరం 1.56 గంటలకు బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బిల్లుకు మద్దతుగా 288 ఓట్లు రాగా..వ్య‌తిరేకంగా 232 ఓట్లు పోలయ్యాయి.

మరుసటి రోజు అంటే ఏప్రిల్ 4న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. ఏప్రిల్ 3న రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. రాత్రి 2.32 గంటలకు రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో ఈ బిల్లుకు 128 మంది ఎంపీల మద్దతు లభించగా, ప్రతిపక్షంలో 95 ఓట్లు వచ్చాయి.

Next Story